వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-05-26T07:04:18+05:30 IST

వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోందని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన శాఖా అధికారి కె.ధనుంజయనేయులు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ అన్నారు.

వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం
అభయారణ్యంలో శిక్షణ క్రీడాకారులు, అధికారులు

భువనగిరి టౌన్‌, మే 25: వేసవి శిక్షణా శిబిరాలతో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోందని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా క్రీడలు, యువజన శాఖా అధికారి కె.ధనుంజయనేయులు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ అన్నారు. రాయిగిరిలో శాంతి ట్రాక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను బుధవారం అభయారణ్యం సందర్శనకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.   అభయారణ్యం ప్రత్యేకతను క్రీడాకారు లకు అటవీశాఖ సిబ్బంది వివ రించారు. కార్యక్రమంలో శాంతి ట్రాక్‌ అసోసియేషన్‌ సభ్యులు అనిల్‌, శ్రీనివాస్‌, గిరి, రమేశ్‌, శంకర్‌, కుమార్‌, హుస్సేన్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-05-26T07:04:18+05:30 IST