Jammu and Kashmir: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-24T12:55:06+05:30 IST

జమ్మూకశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోరి ప్రాంతంలోని పీత్ సీర్ గ్రామంలో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు ప్రారంభం...

Jammu and Kashmir: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభం

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోరి ప్రాంతంలోని పీత్ సీర్ గ్రామంలో ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు ప్రారంభం అయ్యాయి.పీత్ సీర్ గ్రామ పరిసరాల్లో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సుతో కలిసి మంగళవారం గాలింపు చేపట్టారు. గాలిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం గ్రామం నలువైపులా సీలు వేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 


లోపల ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరుపుతూనే గాలిస్తున్నాయి.కశ్మీరులో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ అబ్బాస్ షేక్, రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన సాఖిబ్ మంజూర్ లు హతం అయ్యారు. మృతుల నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-08-24T12:55:06+05:30 IST