తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2022-01-18T15:53:49+05:30 IST

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్

ములుగు జిల్లా: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల వద్ద మంగళవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హనుమకొండ హార్ట్స్ కాలేజీకి హెలికాప్టర్ బయలుదేరింది.ఈ ఆపరేషన్‌లో తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మృతుల్లో మహాదేవపూర్-ఏటూరునాగారం దళకమాండర్ సుధాకర్ ఉన్నట్టు తెలియవచ్చింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు  నిర్ధారించలేదు.

Updated Date - 2022-01-18T15:53:49+05:30 IST