Jammu and Kashmirలో ఉగ్రవాదుల కోసం గాలింపు
ABN , First Publish Date - 2022-04-07T12:55:17+05:30 IST
జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు,భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి....
షోపియాన్ : జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు,భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియలేదు. ఇటీవల దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని ఛోటోగామ్ ప్రాంతంలో కశ్మీరీ పండిట్ దుకాణదారుడిపై ఇద్దరు మోటారుసైకిల్పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.గత రెండు రోజుల్లో పుల్వామాలో నలుగురు స్థానికేతర కార్మికులు, శ్రీనగర్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా ఏడుగురిపై జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.