ఏపీలో ఎంసెట్ నిర్వహణ తేదీ ఖరారు

ABN , First Publish Date - 2020-08-14T21:34:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుండి ఎంసెట్ పరీక్ష జరగనుంది. 17 నుండి 25

ఏపీలో ఎంసెట్ నిర్వహణ తేదీ ఖరారు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుండి ఎంసెట్ పరీక్ష జరగనుంది. 17 నుండి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14న ఈ-సెట్. సెప్టెంబర్ 10, 11న  ఐ-సెట్, సెప్టెంబర్ 28, 29, 30న ఏపీజీ ఈ-సెట్. అక్టోబర్ 1న ఎడ్‌సెట్ (ఉదయం), లా సెట్ (మధ్యాహ్నం). అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.



Updated Date - 2020-08-14T21:34:19+05:30 IST