మహిళల ఆర్థికాభివృద్ధితోనే సాధికారత: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-22T06:03:56+05:30 IST

మహిళలందరూ ఆర్థికాభివృద్ధి చెందినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధితోనే సాధికారత: ఎమ్మెల్యే
మెదక్‌లో మంజీరా రూరల్‌ మార్టును ప్రారంభిస్తున్న మెదక్‌ ఎమ్మెల్యే

మెదక్‌, జూన్‌ 21: మహిళలందరూ ఆర్థికాభివృద్ధి చెందినప్పుడే మహిళా  సాధికారత సాధ్యమవుతుందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నాబార్డు నిధులతో సోమవారం మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన మంజీరా రూరల్‌మార్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలను చదివించాలని, దీంతో సమాజంలో ఆర్థికంగా ఎదగడంతో పాటు ధైర్యంగా జీవించగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో  డీఆర్డీవో శ్రీనివాస్‌, అడిషనల్‌ డీఆర్డీవో భూమయ్య, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఎంపీపీ యమున, వార్డు కౌన్సిలర్లు, ఐకేపీ సిబ్బంది  పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:03:56+05:30 IST