నిబంధనల ప్రకారమే ఉపాధి పనులు

ABN , First Publish Date - 2022-05-21T04:55:44+05:30 IST

ఉపాధి పనులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఎంపీడీవో శోభన్‌ బాబు సూచించారు. మండలంలోని చందలూరు, మారెడ్డిపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పనుల వద్ద తగిన వసతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారమే ఉపాధి పనులు
ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో శోభన్‌ బాబు

 దర్శి, మే 20 : ఉపాధి పనులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఎంపీడీవో శోభన్‌ బాబు సూచించారు. మండలంలోని చందలూరు, మారెడ్డిపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పనుల వద్ద తగిన వసతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం 7 గంటలకే పనులు ఆరంభించాలని, ఎండ తీవ్రత రాకముందే 9 గంటలకు పనులు విరమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

 ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  ఆదివాసీ మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దర్శి తహసీల్దార్‌ ఏవీ రవిశంకర్‌ సూచించారు. దర్శిలో బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం దళిత ఆదివాసీల మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళితసేన నాయకులు జీ. ప్రేమ్‌కుమార్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అనురాధ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:55:44+05:30 IST