‘ఉపాధి’ కూలి వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2022-05-18T05:37:21+05:30 IST
‘ఉపాధి’ కూలి వెంటనే చెల్లించాలి
ఇబ్రహీంపట్నం రూరల్, మే 17: గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పనులు చేస్తున్న కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్ డిమాండ్ చేశారు. మండలంలోని పొల్కంపల్లి, ముక్కునూరు గ్రామాల్లో మంగళవారం ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు గ్రామం నుంచి 7 కిలోమీటర్ల దూరం వెళ్లి పనులు చేస్తున్నా వారికి రవాణాఖర్చులు చెల్లించడంలేదని అన్నారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు చెల్లించడం లేదన్నారు. రెండు పూటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. నేడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిర్వహించే దర్నాలో అన్ని గ్రామాల నుంచి ఉపాధి కూలీలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎ్ఫఐ నాయకులు జగన్ పాల్గొన్నారు.