ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-22T06:44:41+05:30 IST

ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం

ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
గన్నవరంలో నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

గన్నవరం, జనవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను నిలువునా మోసం చేసిందని, వెంటనే చీకటి పీఆర్‌సీ జీవోలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ తూర్పు కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి వై.నరసింహారావు హెచ్చరించారు. పీఆర్‌సీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం గన్నవరం పట్టణంలో నిరసన కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బెనిపిట్‌లు వెంటనే ఇవ్వా లన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యో గులకు మెరుగైన బెనిఫిట్స్‌ ఇవ్వాల్సింది పోయి ఉన్నవాటిల్లోనే కోత విధించేలా చర్యలు తీసుకోవటం దుర్మార్గమన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దాని పతనానికి నాంది అన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిం చటం సరికాదన్నారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ మద్దతు తెలుపుతుందన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి పిల్లి మహేష్‌, నాయకులు సమ్మక్క, లలితకుమారి, బెజవాడ తాతబ్బాయి, మిరప నాగేశ్వరరావు, ఉదయభాస్కర్‌ సూరగాని సాంబశివరావు, శివాచారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కళ్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:44:41+05:30 IST