కాంట్రాక్టు ఉద్యోగులకు వైసీపీ మోసం
ABN , First Publish Date - 2022-01-22T05:09:21+05:30 IST
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేసిందని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ వై నేతాజీ ఆరోపించారు.
మూడో రోజుకు చేరుకున్న ఉద్యోగుల ధర్నా
గుంటూరు(తూర్పు), జనవరి 21: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేసిందని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ వై నేతాజీ ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ఆందోళన శుక్రవారం మూడో రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అనంతరం డీఆర్వో కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుమన్, మాణిక్యం, ముత్యాలరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.