‘ఉద్యోగులను వేధించడం తగదు’

ABN , First Publish Date - 2021-08-04T05:14:48+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగులను వేధించడం తగదని ఏపీఎస్‌ ఆర్టీసీ డిపో కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం విజయనగరం తహసీల్దార్‌ ప్రభాకరరావుకు వినతిపత్రం అందిం చారు.

‘ఉద్యోగులను వేధించడం తగదు’
ఎస్‌.కోటలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎన్‌ఎంయూ నేతలు

రింగురోడ్డు, ఆగస్టు 3: ఆర్టీసీ ఉద్యోగులను వేధించడం తగదని ఏపీఎస్‌ ఆర్టీసీ డిపో కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని  మంగళవారం విజయనగరం  తహసీల్దార్‌ ప్రభాకరరావుకు వినతిపత్రం అందిం చారు.  రీజనల్‌ మేనేజర్‌ ఆదేశాలతో కొందరు స్థానిక డిపో అధికారులు నిబంధన లకు విరుద్ధంగా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై  నెల రోజులుగా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ, ఎటువంటి స్పందన లేదన్నారు. తక్షణమే విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. సంఘ ప్రతినిధులు బీఆర్‌ రావు తదితరులు ఉన్నారు.  

  పార్వతీపురంటౌన్‌:  ఆర్టీసీ  ఉద్యో గులపై అధికారుల వేధింపులకు నిరస నగా ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో స్థానిక డిపో గేటు వద్ద కార్మికులు ఎర్రబ్యాడ్జీలతో ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయూ డిపో కార్యదర్శి తాతబాబు మాట్లాడుతూ.. 1/2019 సర్కులర్‌ను జోన్‌ మొత్తం అమలు చేయక పోవడం వల్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారన్నారు. యూనియన్‌ నాయకులు కేబీరాజు, మోహన రావు, తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: డిమాండ్ల సాధన కోసం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ గేటు వద్ద ఆందోళన చేపట్టింది. అక్రమ బదిలీలను ఆపాలని, సాలూరు డిపో ఏఎంటీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. డిపో సెక్రటరీ ఎ.రాజయ్య, అధ్యక్షుడు జీవీ రమణ, కార్మికులు ఉన్నారు.

 

Updated Date - 2021-08-04T05:14:48+05:30 IST