ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-01-23T05:40:30+05:30 IST
ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి పాల్పడిందని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు దొన్నుదొర
అరకులోయ, జనవరి 22: ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి పాల్పడిందని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు. శనివారం తన నివాసంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రివర్స్ పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 40శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, హెచ్ఆర్ఏ, సీసీఏ వంటి అలవెన్స్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ సీఏం జగన్మోహన్రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, తదితర నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.