ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-05-30T10:52:31+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని బీజేపీ మహిళా రాష్ట్ర నేత సుహాసినీరెడ్డి
బీజేపీ మహిళా రాష్ట్ర నేత సుహాసినీరెడ్డి
ఆదిలాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని బీజేపీ మహిళా రాష్ట్ర నేత సుహాసినీరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ కు సహకరించిన ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ కరువు భత్యం విషయంలో అన్యాయమే చేస్తున్నారని విమర్శించారు.
లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 7150 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దివాల తీసిందన్నారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులందరికి పూర్తి వేతనం ఇవ్వాలని, అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామాలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి నారాయణరెడ్డి, గటికే క్రాంతి, కొత్తపల్లి సంతోష్, అశ్విన్, మోహన్అగర్వాల్, సతీష్, రాపెల్లి అనిత, జానకి, తదితరులు పాల్గొన్నారు.