24న మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభ: మందకృష్ణ
ABN , First Publish Date - 2021-10-11T00:07:05+05:30 IST
24న మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ తెలిపారు.
అమరావతి: 24న మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. వర్గీకరణ సమస్య పరిష్కారంపై ఢిల్లీ వెళ్లినపుడు ప్రమాదానికి గురయ్యానని తెలిపారు. వైద్యులు 6 నెల్లలు పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని చెప్పారు. 15 రోజుల పాటు అభిమానులు, కార్యకర్తలు కోసం విజయవాడలోనే ఉంటానని మందకృష్ణ తెలిపారు.