ప్రభుత్వ నిర్ణయాలతో చిరుద్యోగులకు నష్టం

ABN , First Publish Date - 2022-01-21T05:04:19+05:30 IST

ప్రభుత్వ నిర్ణయాలతో చిరు ద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐటీ యూసీ మండల కార్యదర్శి కారం దారయ్య ఆరోపించారు.

ప్రభుత్వ నిర్ణయాలతో చిరుద్యోగులకు నష్టం
సమావేశంలో మాట్లాడుతున్న దారయ్య

వేలేరుపాడు, జనవరి 20: ప్రభుత్వ నిర్ణయాలతో చిరు ద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐటీ యూసీ మండల కార్యదర్శి కారం దారయ్య ఆరోపించారు. కన్నాయగుట్ట గ్రామంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ సమా వేశం గురువారం నిర్వహించారు. చాలీచాలని వేతనాలతో సకాలంలో జీతా లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ఆశ యూనియన్‌ నాయకురాలు కారం కుమారి, రాజేశ్వరి, సింధూర, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు.


ఖాళీ పోస్టులను భర్తీచేయాలి


బుట్టాయగూడెం: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యో గాలను ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా కోశాధికారి బి.వినోద్‌ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో క్యాలెండర్‌ను అవిష్కరించారు. 3, 4, 5 తరగతలను హైస్కూల్లో విలీనం చేయడం వలన విద్యార్ధులకు మూడు కిలో మీటర్లు దూరం పెరుగుతుందని తెలిపారు. విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పి.మహేష్‌, జి.మణికంఠ, యు.పోసిబాబు, ఎం.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:04:19+05:30 IST