ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతి కల్పించాలి
ABN , First Publish Date - 2021-04-13T05:25:37+05:30 IST
ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్ 12 : ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరులోని ఎన్జీవో భవన్లో సోమవారం ఆ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మినిస్టీరియల్ సిబ్బంది అందరం ఉద్యోగోన్నతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని సంఘాల ఉద్యోగులను కలిపి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీఆర్వోలకు పదోన్నతులు 75శాతం కోటాతో త్వరలో అమలవుతాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య, జిల్లా అధ్యక్షుడు శివయ్య, ఈవోపీఆర్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.