బదిలీల కోసం ప్రదక్షిణలు

ABN , First Publish Date - 2022-06-25T04:39:19+05:30 IST

బదిలీల జ్వరంతో గుమస్తా, ఉద్యోగులు, అధికారులు జిల్లా కేంద్రంలోని నేతల చుట్టూ తిరుగుతున్నారు. పైరవీలలో మునిగి ఉన్నారు.

బదిలీల కోసం ప్రదక్షిణలు

 ప్రభుత్వ కార్యాలయాల వెలవెల

ఇందుకూరుపేట, జూన్‌ 24 : బదిలీల జ్వరంతో గుమస్తా, ఉద్యోగులు, అధికారులు జిల్లా కేంద్రంలోని నేతల చుట్టూ తిరుగుతున్నారు. పైరవీలలో మునిగి ఉన్నారు. దాంతో అన్ని శాఖల విభాగాల అధికారులు, ఉద్యోగులు లేక మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు నాయకుల చుట్టూ తిరుగుతుంటే మండల స్థాయి అధికారులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటి వద్దే పడిగాపులు కాస్తున్నారు. గుమస్తా బదిలీకి కూడా ఎమ్మెల్యే సిఫార్సు ఉత్తరం జిల్లా అధికారులు కోరుతున్నారని సమాచారం. కేవలం నేతల కనుసన్నల్లోనే బదిలీలు జరగడం అలవాటుగా మారింది. జిల్లా అధికారులు కూడా సొంతంగా బదిలీలు నిర్వహించే స్థాయి కోల్పోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. నాయకుల ప్రమేయంతో బదిలీలు చేస్తే చేతికి ఏ సెగ అంటదనే ధోరణిలో అధికారులు ఉన్నారు. రానున్నది ఎన్నికల కాలం అయినందున నాయకులు కీలకమైన అధికారులు మొదలు కిందిస్థాయి వరకు అన్ని రకాలుగా ఏరి కోరి సమతూకాలు పాటించి నియమించుకుంటున్నారు. ఇందుకూరు పేట తహసీల్దారు కోవూరు, ఎంపీడీవో నియోజకవర్గంలోనే ఏదో ఒక మండలం కోరుతున్నట్టు, ఇప్పటికే ఎమ్మెల్యేను కలిసినట్టు  తెలుస్తోంది.

Updated Date - 2022-06-25T04:39:19+05:30 IST