ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
ABN , First Publish Date - 2021-06-22T06:16:56+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో ఆందోళన చేశారు. చుట్టుగుంటసెంటర్లోని ఉద్యానశాఖ రాష ్ట్రకార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నల్లబాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు.
గుంటూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో ఆందోళన చేశారు. చుట్టుగుంటసెంటర్లోని ఉద్యానశాఖ రాష ్ట్రకార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నల్లబాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు. మినిమం టైంస్కేల్ ఇవ్వాలని, ప్రభు త్వశాఖల్లోని ఖాళీ పోస్టులలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఎసీ ప్రధానకార్యదర్శి డి.భానూజీరావు, వెంకటప్పయ్య రెడ్డి, శివప్రసాద్, శివనాయక్, రవి, జాన్బి తదితరులు పాల్గొన్నారు.