రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-19T06:03:33+05:30 IST

మండల కేంద్ర సమీపంలోని కనుమ వద్ద జా తీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో పంచాయతీరాజ్‌ ఉద్యోగి వినోద్‌కుమార్‌ (52) దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం
వినోద్‌కుమార్‌ మృతదేహం

చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 18: మండల కేంద్ర సమీపంలోని కనుమ వద్ద జా తీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో పంచాయతీరాజ్‌ ఉద్యోగి వినోద్‌కుమార్‌ (52) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంచాయతీరాజ్‌ పీఐఏ పెనుకొండ సబ్‌డివిజన కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ ద్విచక్రవాహనంలో విధుల నిమిత్తం అనంతపురం నుంచి పెనుకొండకు బయల్దేరాడు. కనుమ వద్దకు రాగానే హంద్రీనీవా కాలువ వద్ద బైక్‌ ఆదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తాపడింది. ప్రమాదంలో వినోద్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, పరిశీలించారు. వినోద్‌కుమార్‌కు భార్య వసుంధర, కుమార్తె ఉన్నారు.


Updated Date - 2021-10-19T06:03:33+05:30 IST