‘సీనియర్‌ సిటిజన్లకు అత్యవసర మందులు సరఫరా చేయాలి’

ABN , First Publish Date - 2020-05-27T09:36:41+05:30 IST

రాష్ట్రంలో సీనియర్‌ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు

‘సీనియర్‌ సిటిజన్లకు అత్యవసర మందులు సరఫరా చేయాలి’

బర్కత్‌పుర, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీనియర్‌ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పరిష్కరించాలని తెలంగాణ సీనియర్‌ సిటిజన్ల సంఘాల సమాఖ్య వ్యవస్థాపకులు పొదిల కనకరత్నం, అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి డిమాండ్‌ చేశారు. సీనియర్‌ సిటిజన్లందరికీ అత్యవసరమైన మందులు, పోషకాహార పదార్థాలను, పౌరసరఫరాల విభాగం, అంగన్‌వాడీల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మంగళవారం సంఘం కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్‌ సిటిజన్ల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. 

Updated Date - 2020-05-27T09:36:41+05:30 IST