అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-27T06:17:00+05:30 IST

స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు.

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం 

స్పందనకు భారీగా తరలివచ్చిన ప్రజానీకం

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 26 : స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో కాలువల కింద నష్టపోతున్న భూములకు పరిహారం ఇప్పించాలని ఉప్పుగుండూరుకు చెందిన ఎం.వెంకటేశ్వర్లు, జి.ఆంజనేయులు కోరారు. మరుగుదొడ్లు నిర్మించినట్లు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి అక్రమంగా బిల్లులు తీసుకున్నారని కొండపి మండలం ముప్పవరానికి చెందిన నరసింహరాజు ఫిర్యాదు చేశారు. వెలిగొండ నిర్మాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజుతాండాలకు చెందిన బాలపిచ్చియ్య, కృష్ణారెడ్డి, పౌలు, అవుల నాగిరెడి కోరారు. గ్రామాలను విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్యాకేజీలను వర్తింపజేసే విధంగా చూడాలని కోరారు. ఆవిధంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజానీకం పలురకాల సమస్యలపై సుమారు 300కుపైగా అర్జీలు అందజేశారు. జేసీలు వెంకటమురళి, టీఎస్‌చేతన్‌, కేఎస్‌ విశ్వనాథన్‌, కేకృష్ణవేణి, డీఆర్వో తిప్పేనాయక్‌, పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:17:00+05:30 IST