కోవిడ్ నిబంధనల మధ్య ఏపీ ఎంసెట్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-09-17T16:36:03+05:30 IST
అమరావతి: కోవిడ్ నిబంధనల మధ్య ఏపీ ఎంసెట్ పరీక్షలు జరగుతున్నాయి. నేటి నుంచి 25 తేదీ వరకు ఏపీ ఎంసెట్ జరగనుంది.
అమరావతి: కోవిడ్ నిబంధనల మధ్య ఏపీ ఎంసెట్ పరీక్షలు జరగుతున్నాయి. నేటి నుంచి 25 తేదీ వరకు ఏపీ ఎంసెట్ జరగనుంది. గంటన్నర ముందు నుంచే హాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామినేషన్ హాల్లోకి నో ఎంట్రీ. ప్రతి విద్యార్థి మాస్కు తప్పని సరిగా ధరించాలి. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం మధ్యాహ్నం రెండు విడతల్లో మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 2 లక్షల 72,946మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేయగా.. ఆంధ్రప్రదేశ్లో 115 సెంటర్స్ తెలంగాణలో 3 సెంటర్లను ఏర్పాటు చేశారు.