భారత 75వ స్వాతంత్ర్య వేడుకలకు.. కువైట్లోని ఎంబసీ కర్టెన్ రైజర్ కార్యక్రమం
ABN , First Publish Date - 2021-03-26T13:41:41+05:30 IST
ఈ ఏడాది ఆగస్టు 15న భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న విషయం తెలిసిందే.
కువైట్ సిటీ: ఈ ఏడాది ఆగస్టు 15న భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని భారత ఎంబసీ ఈ ల్యాండ్మార్క్ వేడుకులను ఈ నెల 31న(బుధవారం) వర్చువల్గా 'కర్టెన్ రైజర్' కార్యక్రమం ద్వారా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కువైట్లోని భారత పౌరులు, స్నేహితులను ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. బుధవారం ఉదయం 10.15 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపింది. వర్చువల్గా జరిగే ఈ కార్యక్రమంలో https://zoom.us/j/91423908856?pwd=d1Q1bDJEQkdKQVBLZExlSE9Qejgxdz09 లింక్ ద్వారా మీటింగ్ కోడ్: 914 2390 8856, మీటింగ్ ఐడీ: 681987లను ఉపయోగించడం ద్వారా పాల్గొనవచ్చని వెల్లడించింది.