ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు ఎంబసీ కీలక సూచన.. అర్జెంట్‌గా డాక్యుమెంట్‌‌లో పూర్తి వివరాలను..

ABN , First Publish Date - 2022-03-06T20:03:57+05:30 IST

ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు పది రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విష

ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు ఎంబసీ కీలక సూచన.. అర్జెంట్‌గా డాక్యుమెంట్‌‌లో పూర్తి వివరాలను..

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు పది రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా అక్కడ చిక్కుకున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన గూగుల్ డాక్యుమెంట్‌‌‌లో పూర్తి వివరాలను పేర్కొని దాన్ని సబ్మిట్ చేయాలని సూచించింది. ఉక్రెయిన్‌లోని భారతీయులందరూ సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని వెల్లడించింది. దీని ద్వారా ఉక్రెయిన్‌లో ఇంకా ఎంత మంది భారతీయులు ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారత పౌరులను ఇండియాకు తరలించడంలో భాగంగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఇండియన్ ఎంబసీ ఒక కంట్రోల్ రూ‌మ్‌ను ఏర్పాటు చేసింది. 






Updated Date - 2022-03-06T20:03:57+05:30 IST