కువైట్లోని భారత ఎంబసీ.. వినూత్న హోలీ వేడుక!
ABN , First Publish Date - 2021-03-31T13:43:07+05:30 IST
కువైట్లోని భారత ఎంబసీ ఈసారి రంగుల పండుగ హోలీ వేడుకలను వినూత్నంగా నిర్వహించింది.
కువైట్ సిటీ: కువైట్లోని భారత ఎంబసీ ఈసారి రంగుల పండుగ హోలీ వేడుకలను వినూత్నంగా నిర్వహించింది. రాయబార కార్యాలయం ముందు వివిధ రంగులతో కూడిన 'హ్యాపీ హోలీ' పేరిట ఓ ప్రత్యేక ఫొటో ఫ్రేమ్ను ఏర్పాటు చేసింది. రాయబార కార్యాలయానికి వచ్చే సందర్శకులను ఈ ఫొటో ఫ్రేమ్తో వెల్కం చెప్పింది. ఇక ఎంబసీకి వచ్చిన సందర్శకులు, అధికారులు, ప్రవాసులు పండుగ రోజు ఈ ఫొటో ఫ్రేమ్తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. దీంతో పాటు ఎంబసీ సిబ్బంది కొన్ని రంగులను కూడా అందుబాటులో ఉంచింది. అలాగే రిసెప్షన్ వద్ద కూడా హోలీ పండుగ విశిష్టతను గుర్తు చేస్తూ వివిధ రంగులతో భారీ రంగోలి వేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్బంధ వేడులకు రాయబార కార్యాలయం శ్రీకారం చుట్టింది. ఇక హోలీ పండుగ సందర్భంగా కువైట్లోని భారతీయులకు రాయబారి సీబీ జార్జ్ శుభాకాంక్షలు తెలియజేశారు.