పురస్కారం అందుకుంటున్న ఏలూరు యంగన్న

ABN , First Publish Date - 2022-06-24T06:45:09+05:30 IST

జనప్రియ కవి ఏలూరు యంగన్న కళాప్రపూర్ణ పైడి లక్ష్మయ్య స్మారక పురస్కారం అందుకున్నారు.

పురస్కారం అందుకుంటున్న ఏలూరు యంగన్న
పురస్కారం అందుకుంటున్న ఏలూరు యంగన్న

xఅనంతపురం కల్చరల్‌, జూన 23: జనప్రియ కవి ఏలూరు యంగన్న కళాప్రపూర్ణ పైడి లక్ష్మయ్య స్మారక పురస్కారం అందుకున్నారు. పైడి లక్ష్మయ్య ట్రస్టు ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుంచి జిల్లాకు చెందిన సీనియర్‌ కవి ఏలూరు యంగన్నను పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ సభలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌, నరసింహప్ప, పైడి సందీప్‌, డాక్టర్‌ కేవీ రమణ చేతులమీదుగా యంగన్నకు పురస్కారం అందజేసి సత్కరించారు.

Updated Date - 2022-06-24T06:45:09+05:30 IST