Eluru: ప్రైవేటు బస్సు బోల్తా... ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-20T16:41:15+05:30 IST

జిల్లాలోని గుండుగొలను సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Eluru: ప్రైవేటు బస్సు బోల్తా... ముగ్గురికి గాయాలు

ఏలూరు:  జిల్లాలోని గుండుగొలను సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దెందులూరు మండలం సింగవరం పరిధి గుండుగోలను వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 నుంచి 40లోపు ప్రయాణికులు ఉన్నారు. బస్సు రాజాం నుండి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే దెందులూరు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్ ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు 108 అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారని  ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-06-20T16:41:15+05:30 IST