25న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్
ABN , First Publish Date - 2021-07-22T17:56:44+05:30 IST
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ను ఈనెల 25 న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
విజయవాడ: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ను ఈనెల 25 న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి కె కన్నబాబు ఈరోజు నోటిఫికేషన్ను విడుదల చేశారు. మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయాంటూ ఎస్ఈసీ నోటీసులో పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిభందనలు పక్కాగా పాటించాలని ఆదేశించింది. పోటీ చేసిన వారు తమ కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈనెల 24 సాయంత్రం 5 గంటల్లోగా సూచించిన ఫార్మెట్ ప్రకారం దరఖాస్తులను రిటర్నింగ్ అధికారికి అందించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.