ట్రాక్టర్‌ ఢీకొని ప్రధానోపాధ్యాయుడు మృతి

ABN , First Publish Date - 2022-08-19T01:28:55+05:30 IST

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ట్రాక్టర్‌ ఢీకొని ప్రధానోపాధ్యాయుడు మృతి

ఏలూరు: ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పెదవేగి మండలం రాయన్నపాలెం శివారు చింతలపాటివారిగూడెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న జక్కుల రాజశేఖర్‌ గురువారం మధ్యాహ్నం భోజన విరామం తరువాత ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న బూట్లను తీసుకురావడానికి పెదవేగి మండల విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళారు. బూట్లను గోనె సంచిలో వేసుకుని, ద్విచక్ర వాహనంపై పెట్టుకుని, చింతలపాటివారిగూడెం బయలుదేరారు. పాఠశాలకు కిలోమీటరు దూరంలో రాయన్నపాలెం శివారు లేళ్ళగూడెం దగ్గర ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ద్విచక్రవాహనంతో సహా ఉపాధ్యాయుడు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుకే వస్తున్న ట్రాక్టరు అతని తలపై నుంచి వెళ్ళడంతో ఉపాధ్యాయుడు జక్కుల రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని శవపరీక్షకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ప్రసన్నరాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2022-08-19T01:28:55+05:30 IST