కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2021-07-25T05:33:58+05:30 IST
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్త య్యాయి.
నేడు ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఏలూరు టూటౌన్, జూలై 24 : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్త య్యాయి. నగరంలోని 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవమవడంతో మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం 8 గంట లకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. కళాశాలలో నాలుగు హాల్స్ ఏర్పాటు చేసి వీటిలో 47 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్లో ఒక్కొ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు కోసం 64 మంది సూపర్ వైజర్లను, కౌంటింగ్ అసిస్టెం ట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరుగాక 500 మంది మున్సిపల్ సిబ్బం ది పాల్గొంటున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు 16 మంది, రిజర్వుడులో ముగ్గురిని ఉం చారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా 13 మందిని ఏర్పాటు చేసి మరో ముగ్గురిని రిజర్వులో ఉంచారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. ఆర్వోలు, ఏఆర్వో లకు శనివారం అవగాహన నిర్వ హించారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వ హించారు. పోటీ చేసిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు. అభ్యర్థులు అందజేసిన పేర్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సెల్ ఫోన్లను అనుమతించరు. కౌంటింగ్ హాల్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి విజేత లను ప్రకటించే వరకు వీడియో కెమెరా ద్వారా పరిశీలిస్తారు. ఏర్పాట్లను పోలీసు అధికారులు, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ పరిశీలించారు. లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ తెలిపారు. సిబ్బందికి అల్పాహారం, భోజన ఇతర సదుపాయాలు ఏర్పాట్లు చేశామన్నారు.
ఎస్ఈసీ నీలం సాహ్ని పరిశీలన
పెదపాడు, జూలై 24 : సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఐజీ కేవీ మోహనావు, జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మలతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఎన్నికల కమిషనర్కు వివరించారు. జేసీ వెంకటరమణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ, ఆర్డీవో రచన, డీఎస్పీ దిలీప్కిరణ్, మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్, ఏలూరు తహసీల్దారు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో మద్యం దుకాణాలు బంద్
ఏలూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా నగరంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో శని, ఆదివారాల్లో నగరం లోని మద్యం దుకాణాలను అధికారులు మూసివేశారు.