పెళ్లికి 8 రోజుల ముందు ప్రియుడితో కలిసి పారిపోయిన యువతి.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-13T05:44:24+05:30 IST

ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఇంట్లో పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెళ్లికి ఇంకో 8 రోజుల సమయం ఉందనగా ఆమె ఇంటి నుంచి పరారైంది.. తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది..

పెళ్లికి 8 రోజుల ముందు ప్రియుడితో కలిసి పారిపోయిన యువతి.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఇంట్లో పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెళ్లికి ఇంకో 8 రోజుల సమయం ఉందనగా ఆమె ఇంటి నుంచి పరారైంది.. తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. అయితే తాజాగా ఆమె మృతదేహం పోలీసులకు దొరికింది. 


ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌కు చెందిన బాధిత యువతికి ఫిబ్రవరి 16న పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ఎనిమిది రోజుల ముందు ఆమె ఇంటి నుంచి పరారైంది. ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన ఒక యువకుడు పూలు, ఆకులు కోయడానికి ఊరి బయటికి వెళ్లాడు. అక్కడ బాలిక మృతదేహాన్ని చూశాడు. తిరిగి వచ్చి ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. సమాచారం అందుకున్న యువతి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 


ఆ యువతి మొండెం నుంచి తల వేరుగా పడి ఉంది. కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత యువతి ప్రియుడు విష్ణుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.



Updated Date - 2022-03-13T05:44:24+05:30 IST