జర్ననీ వెళ్లిన ఎలాన్ మస్క్.. గిగాఫ్యాక్టరీ నిర్మాణంపైనే చర్చ

ABN , First Publish Date - 2021-08-13T10:00:10+05:30 IST

స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ జర్మనీ వెళ్లాడు. దేశ ముఖ్య నేతలతో సమావేశమయ్యాడు. టెస్లాకు చెందిన గిగాఫ్యాక్టరీ నిర్మాణం..

జర్ననీ వెళ్లిన ఎలాన్ మస్క్.. గిగాఫ్యాక్టరీ నిర్మాణంపైనే చర్చ

బెర్లిన్: స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ జర్మనీ వెళ్లాడు. దేశ ముఖ్య నేతలతో సమావేశమయ్యాడు. టెస్లాకు చెందిన గిగాఫ్యాక్టరీ నిర్మాణం ప్రస్తుతం ఈ నగరంలోనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జర్మనీ దేశ ఆర్థిక మంత్రి జార్జ్ స్టెయిన్‌బక్‌ తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాన్ మస్క్ ఫోటోను షేర్ చేశారు. మస్క్‌తో గిగాఫ్యాక్టరీ నిర్మాణం గురించి చర్చించడం జరిగిందని, గిగాఫ్యాక్టరీ నిర్మాణం అనుకున్న సమయంలోగా పూర్తి కావడం తమ కంపెనీకి ఎంత ముఖ్యమో మస్క్ తమకు వివరించారని వెల్లడించారు. ఈ సమావేశంలో బ్రాండెన్‌బర్గ్ స్టేట్ ప్రీమియర్(రాష్ట్ర ప్రధాన నేత) డెయిట్‌మర్ ఓయిడెక్ కూడా పాల్గొన్నారని జార్జ్ తెలిపారు.

Updated Date - 2021-08-13T10:00:10+05:30 IST