తోలుబొమ్మంటూ అమెరికా అధ్యక్షుడిపై ఎలాన్ మస్క్ ధ్వజం!
ABN , First Publish Date - 2022-01-29T13:13:47+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా దుమ్మెత్తిపోశారు. బైడెన్ మనిషి రూపంలో ఉన్న ఒక తోలుబొమ్మ అంటూ మండిపడ్డారు.
బైడెన్ మనిషి రూపంలోని తోలుబొమ్మ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా దుమ్మెత్తిపోశారు. బైడెన్ మనిషి రూపంలో ఉన్న ఒక తోలుబొమ్మ అంటూ మండిపడ్డారు. టెస్లా ప్రత్యర్థులైన జనరల్ మోటార్స్(జీఎం), ఫోర్డ్ సంస్థల ప్రతినిధులతో బైడెన్ ఇటీవల భేటీ అవడమే కాక అమెరికాలోని విద్యుత్ వాహన తయారీ సంస్థల గురించి తాజాగా చేసిన ఓ ట్వీట్లోనూ టెస్లా పేరును ప్రస్తావించకపోవడం మస్క్ ఆగ్రహానికి కారణమైంది. ‘‘జీఎం, ఫోర్డ్ వంటి సంస్థలు గతంలో కంటే అత్యధికంగా విద్యుత్ వాహనాలను అమెరికాలో తయారుచేస్తున్నాయి’’ అని బైడెన్ చేసిన ట్వీట్ కింద సమాధానంగా టెస్లా అన్న పదాన్ని పెద్ద అక్షరాలతో రాస్తూ మస్క్ సమాధానం పోస్ట్ చేశారు. బైడెన్ యంత్రాంగం తమ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, యూనియన్ల అదుపులోకి వెళ్లిపోయిందని గత ఏడాది సెప్టెంబరులోనూ మస్క్ విమర్శించడం గమనార్హం.