ఇళ్లున్న వారికే పట్టాలు ఇస్తారా..?

ABN , First Publish Date - 2022-05-24T03:13:37+05:30 IST

నూటికి 50మందికిపైగా ఇళ్లున్న వారికే ఇళ్ల స్థలాలు ఇస్తే, స్థలాలు లేని వారి పరిస్థితి ఏమిటని బుచ్చి నగర పంచాయతీ 16వవార్డు కౌ

ఇళ్లున్న వారికే పట్టాలు ఇస్తారా..?
తహసీల్దారకు వినతిపత్రం ఇస్తున్న 16వవార్డు కౌన్సిలర్‌ ప్రమీలమ్మ


బుచ్చిరెడ్డిపాళెం,మే23 : నూటికి 50మందికిపైగా ఇళ్లున్న వారికే ఇళ్ల స్థలాలు ఇస్తే, స్థలాలు లేని వారి పరిస్థితి ఏమిటని బుచ్చి నగర పంచాయతీ 16వవార్డు కౌన్సిలర్‌ బిట్రగుంట ప్రమీలమ్మ సోమవారం తహసీల్దారు ముందు ఏకరువు పెట్టారు. ఈ మేరకు ఆమె వినతిపత్రం అందజేసి వలంటీర్ల ద్వారా మరోసారి విచారణ చేయించి, అర్హులకు ఇళ్ల  స్థలాలు, పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. 

పట్టాలు రాలేదంటున్నారు...

గతేడాది క్రితమే స్థలాలు మంజూరయ్యాయి. పట్టాలు కూడా వచ్చాయంటూ నెంబర్లు కూడా ఇచ్చారు. ఉగాదన్నారు... సంక్రాంతన్నారు.. ఈనెల 25న పట్టాలు పంపిణీ చేస్తారంటున్నారు. కానీ మాకేమో పట్టాలు రాలేదంటున్నారని 16వవార్డు పరిధిలోని ఖాజా బీబ్జాన్‌, నస్రీమా, శ్రీదేవి, భాషా, సుకన్య, రాధమ్మతోపాటు పలువురు కన్నీటి పర్యంతమౌతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్ట ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు.

Updated Date - 2022-05-24T03:13:37+05:30 IST