ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎల్లూబాయి

ABN , First Publish Date - 2022-08-15T05:46:05+05:30 IST

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎల్లూబాయి

ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎల్లూబాయి

శామీర్‌పేట, ఆగస్టు 14 : శామీర్‌పేట ఎంపీపీ ఎల్లూబాయిని ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఎంపీపీల ఫోరం నూతన అధ్యక్షురాలిగా మంత్రి మల్లారెడ్డి నియమించారు. ఈసందర్భంగా ఎంపీపీని మంత్రి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకముంచి ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకుగాను ఎల్లూబాయి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మూడుచింతలపల్లి, కీసర, మేడ్చల్‌ ఎంపీపీలు హారిక, ఇందిర, రజిత, జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌, మేడ్చల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి పలువురున్నారు.

Updated Date - 2022-08-15T05:46:05+05:30 IST