జహీరాబాద్‌లో ఎల్లిసియం ఈవీ ప్లాంట్‌

ABN , First Publish Date - 2022-06-23T08:01:43+05:30 IST

ఈవియం బ్రాండ్‌నేమ్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు యూఏఈకి చెందిన మెటా4 గ్రూప్‌ కంపెనీ ఎల్లిసియం ఆటోమోటివ్స్‌ ప్రకటించింది.

జహీరాబాద్‌లో ఎల్లిసియం ఈవీ ప్లాంట్‌

రూ.250 కోట్ల పెట్టుబడి

ముంబై: ఈవియం బ్రాండ్‌నేమ్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు యూఏఈకి చెందిన మెటా4 గ్రూప్‌ కంపెనీ ఎల్లిసియం ఆటోమోటివ్స్‌ ప్రకటించింది. నెల రోజుల్లో మూడు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఈ-స్కూటర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రూ.250 కోట్ల పెట్టుబడితో, తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న పూర్తి స్థాయి ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు ఎల్లిసియం స్పష్టం చేసింది. ఈవీల తయారీ ప్లాంట్‌ కోసం 15 ఎకరాల స్థలం కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఈమధ్యనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ప్లాంట్‌ అందుబాటులోకి రానుంది. 

Updated Date - 2022-06-23T08:01:43+05:30 IST