ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి : కలెక్టర్
ABN , First Publish Date - 2022-08-17T03:24:56+05:30 IST
జగనన్న లేఅవుట్లలోని ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు అధికారులను ఆదేశించారు.
ఆత్మకూరు, ఆగస్టు 16 : జగనన్న లేఅవుట్లలోని ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పమిడిపాడు, నెల్లూరుపాళెం సమీపంలోని జగనన్న లే అవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబరు నెలాఖరుకు లేఅవుట్లలోని అన్నీ ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ స్థాయిని దాటాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి ఇళ్లన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయన నెల్లూరుపాళెం వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సీడీ బీఆర్ రంగవర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్బాబు, ఆర్డీవో కరుణకుమారి, హౌసింగ్ ఈఈ శ్రీనివాసులు, డీఈ నటరాజన్ ఏఈ శాంతకుమార్, మున్సిపల్ కౌన్సిలర్ చెరుకూరు కామాక్షయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.