‘మత్స్య సొసైటీలో అర్హులకు సభ్యత్వం అందించాలి’
ABN , First Publish Date - 2022-05-18T06:55:04+05:30 IST
మత్స్య సొసైటీలో అర్హులైనవారందరికీ సభ్యత్వం అందించాలని నారాయణపురం గ్రామానికి చెందిన ముదిరాజులు కోరారు.
చిలుకూరు, మే 17: మత్స్య సొసైటీలో అర్హులైనవారందరికీ సభ్యత్వం అందించాలని నారాయణపురం గ్రామానికి చెందిన ముదిరాజులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నారాయణపురం చెరువు సంఘంలో 239మందికి సభ్యత్వాలు ఉండగా, వారిలో 140 మంది మృతి చెందారని, వారి స్థానంలో గ్రామానికి చెందిన అర్హులైన ముది రాజులకు సభ్యత్వం అందజేయాలని కోరారు. వినతి పత్రం అందజేసినవారిలో జానకిరాములు, రంగయ్య, వెంకటేశ్వర్లు ఉన్నారు.
అసోసియేష