Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-31T18:17:17+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు....

Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం

ఏడుగురికి తీవ్ర గాయాలు

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. బికనేర్-జోధ్ పూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రక్కు వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది యాత్రికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో 8మంది మహిళలున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారు రామ్ దేవర, కర్నీ మాత దేవాలయాల్లో పూజలు చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని నోఖాలోని ఆసుపత్రికి తరలించామని బికనేర్ పోలీసులు చెప్పారు. 


శ్రీబాలాజీ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది యాత్రికులు మరణించడం విచారకరమని, వారి సంతాపం ప్రకటిస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల పరిహారం ఇస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే డబ్బును మధ్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని సీఎం చెప్పారు. 

Updated Date - 2021-08-31T18:17:17+05:30 IST