ఏనుగులు స్వైర విహారం
ABN , First Publish Date - 2022-05-28T06:00:40+05:30 IST
ఏనుగుల స్వైరవిహారానికి పెద్దపంజాణి మండలంలో రైతులు విలవిలలాడుతున్నారు
దెబ్బతిన్న టమోట, వరి, మామాడి
పెద్దపంజాణి, మే 27: ఏనుగుల స్వైరవిహారానికి పెద్దపంజాణి మండలంలో రైతులు విలవిలలాడుతున్నారు. మండలంలోని కోగిలేరు గ్రామ సమీపంలో గురువారం రాత్రి టమోటా, వరి పంటలు, మామిడి తోటలపై ఏనుగులు గుంపులుగా దాడులు చేసి తీవ్ర నష్టం కలిగించాయి. ఈ మేరకు శుక్రవారం రైతులు సచివాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వల్లెమ్మకు రెండు ఎకరాల కోత దశలో ఉన్న టమోటా పంటతో పాటు పీవీసీ పైపులు, బోరు, స్టార్టరును ధ్వంసం చేశాయి, హరి శ్రావణ్కు చెందిన మామిడి తోట, సిద్దమ్మకు చెందిన వరి పంటను పూర్తిగా నాశనం చేశాయని బాధితులు వాపోయారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని సర్పంచు రమేష్బాబు పేర్కొన్నారు.