పంటపొలాల్లోకి ఏనుగులు...పరుగులు తీసిన రైతులు

ABN , First Publish Date - 2021-04-21T06:12:14+05:30 IST

పలమనేరు మండలంలోని ఊసరపెంట సమీపంలోని పంటపొలాలపై మంగళవారం వేకువజామున మూడుగంటల ప్రాంతంలో విరుచుకుపడ్డాయి.

పంటపొలాల్లోకి ఏనుగులు...పరుగులు తీసిన రైతులు
ధ్వంసమైన మామిడితోట

పలమనేరు రూరల్‌,ఏప్రిల్‌ 20: పలమనేరు మండలంలోని ఊసరపెంట సమీపంలోని పంటపొలాలపై మంగళవారం వేకువజామున మూడుగంటల ప్రాంతంలో విరుచుకుపడ్డాయి. 11 ఏనుగులున్న గుంపు మామిడి, వరి, టమోటపంటలను నాశనం చేశాయి.  దాడుల్లో  గ్రామానికి చెందిన లావణ్య అనే రైతుకు చెందిన మామిడి, జయరామనాయుడు, చిన్నపాపమ్మలకు చెందిన వరి, బాబునాయుడుకు చెందిన టమోట పంటలను ఆరగించి తొక్కేశాయి. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రైతులు వ్యవసాయపొలాల్లో పనులు చేసుకొంటుండగా, పట్టపగలే పంటల్లోకి మళ్లీ ప్రవేశించాయి. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఆ తరువాత గ్రామస్తులందరూ ఏకమై ఏనుగుల గుంపును తరిమేందుకు ప్రయత్నించగా, అవి అక్కడ నుంచి అంగుళం కూడా కదలలేదు. పంటకోతదశకు వచ్చి చేతికందే సమయంలో ఏనుగులు నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఏనుగుల దాడుల నుంచి పంటలను రక్షించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అధికారుకు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2021-04-21T06:12:14+05:30 IST