యాదమరిలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు

ABN , First Publish Date - 2020-11-28T05:40:04+05:30 IST

ఏనుగుల గుంపు శుక్రవారం బండివాళ్లవూరు, పుల్లయ్యగారిపల్లె, కీనాటంపల్లె, గుట్టకిందవూరు సమీపంలో అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్నాయి

యాదమరిలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు
అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగుల గుంపు

యాదమరి, నవంబరు 27: చిత్తూరు రూరల్‌ మండలం నుంచి గురువారం యాదమరి మండలం 70కొత్తపల్లె వైపు వచ్చిన ఏనుగుల గుంపు శుక్రవారం బండివాళ్లవూరు, పుల్లయ్యగారిపల్లె, కీనాటంపల్లె, గుట్టకిందవూరు సమీపంలో అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్నాయి. వెస్ట్‌ డీఎఫ్‌వో శివరాం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏనుగుల గుంపును కొటాలం నుంచి  తమిళనాడు అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో పంటల వైపు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు రైతులకు సూచించారు.

Updated Date - 2020-11-28T05:40:04+05:30 IST