Viral video: తమను డిస్ట్రబ్ చేసినందుకు ఏనుగులు ఏం చేశాయంటే.. దెబ్బకు పరుగులు తీసిన జనం..
ABN , First Publish Date - 2022-06-29T00:59:01+05:30 IST
సాధారణంగా జంతువులేవీ వాటంతట అవి ఇతరులకు హాని కలిగించవు.
సాధారణంగా జంతువులేవీ వాటంతట అవి ఇతరులకు హాని కలిగించవు. వాటి జోలికి వెళ్లి డిస్ట్రబ్ చేస్తే తప్ప మనుషులకు అపాయం తలపెట్టవు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగుల గుంపు సైలెంట్గా రోడ్డు దాటుతోంది. ఆ రూట్లో వెళుతున్న వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయితే కొందరు మాత్రం కారు హారన్ మోగించి వాటిని భయపెట్టారు. దాంతో అవి తమ ప్రతాపం చూపించాయి.
karnatakaలోని హసనూర్ అటవీ ప్రాంతంలోని కొన్ని ఏనుగులు రోడ్డు మీదకు వచ్చాయి. కామ్గా రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో కొందరు ప్రయాణికులు తమ కార్ల హర్న్లు మోగించారు. దీంతో ఆ ఏనుగులు బెదిరిపోయాయి. ఓ కారు పైకి దూసుకొచ్చాయి. ఆ కారు అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు రావడం చూసి అందులోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారిణి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.