పెళ్లి వేడుకల్లో ఏనుగు బీభత్సం... పరుగులు పెట్టిన వరుడు, బంధువులు!

ABN , First Publish Date - 2021-06-13T05:18:51+05:30 IST

పెళ్లి వేడుకలో ఏనుగు బీభత్సం... పరుగులు పెట్టిన వరుడు, బంధువులు!

పెళ్లి వేడుకల్లో ఏనుగు బీభత్సం... పరుగులు పెట్టిన వరుడు, బంధువులు!

ప్రయాగ్‌రాజ్: వివాహ వేడుకల కోసం తీసుకొచ్చిన ఓ ఏనుగు పెళ్లివారు కాల్చిన బాణసంచా శబ్ధాలకు చిర్రెత్తుకొచ్చి నానా బీభత్సం సృష్టించింది. గజరాజు నుంచి కాపాడుకునేందుకు వరుడు, అతడి బంధువులు పరుగులు పెట్టారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా అమ్లాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల్లో ఏనుగు సృష్టించిన రచ్చ తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బారాత్‌లో భాగంగా నారాయణ్‌పూర్ గ్రామం నుంచి ఓ ఏనుగు మీద ఆనంద్ త్రిపాఠీ అమ్లాపూర్ గ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికేందుకు కొందరు బాణసంచా కాల్చారు. ఈ శబ్ధాలు గజరాజుకు చిరాకు తెప్పించాయి. దీంతో అది ఆగ్రహంతో ఊగిపోతూ పెళ్లికోసం ఏర్పాటు చేసిన మండపాన్ని కూల్చేసింది. వేదిక పక్కనే నిలిపి వుంచిన దాదాపు 12 కార్లను ధ్వంసం చేసింది. ఏనుగు అదుపు తప్పడంతో వరుడు, అతడి బంధువులు దాన్నుంచి తప్పించుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసు బృందం, అటవీశాఖ అధికారులు వచ్చి ఏనుగును శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-06-13T05:18:51+05:30 IST