అడవిలో ఏనుగు దాడిలో రేంజ్ ఆఫీసర్ మృతి

ABN , First Publish Date - 2020-08-15T12:24:33+05:30 IST

ఓ ఏనుగు అటవీశాఖ అధికారిని చంపిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా పులుల అభయారణ్యంలో జరిగింది.....

అడవిలో ఏనుగు దాడిలో రేంజ్ ఆఫీసర్ మృతి

పన్నా (మధ్యప్రదేశ్): ఓ ఏనుగు అటవీశాఖ అధికారిని చంపిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా పులుల అభయారణ్యంలో జరిగింది. పన్నా పులుల అభయారణ్యంలో ట్రాకింగ్ ఆపరేషన్ కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కె భగత్ (52) అడవుల్లోకి వెళ్లారు.అడవిలో రెండు పులుల పోరాటంలో ఓ పులి మరణించింది. దీనిపై ఆరా తీసేందుకు అడవికి వెళ్లిన భగత్ ను రామ్ బహదూర్ అనే ఏనుగు తన దంతంతో పొడిచి చంపిందని అటవీశాఖ అధికారి కెఎస్ భడోరియా చెప్పారు. రేంజ్ ఆఫీసర్ భగత్ అడవిలో సంచరిస్తుండగా ఏనుగు వచ్చి అతన్ని వీపు నుంచి విసిరి దంతంతో చంపిందని సమాచారం. 20 ఏళ్ల క్రితం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర అడవుల నుంచి 8 ఏనుగుల్లో రామ్ బహదూర్ ఏనుగు ఒకటి. ఏనుగు దాడిలో అటవీశాఖ అధికారి మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2020-08-15T12:24:33+05:30 IST