బావిలో పడి.. లేచిన ఏనుగు!

ABN , First Publish Date - 2020-04-10T08:14:49+05:30 IST

చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం మండలాల్లోని అటవీ సరిహద్డు గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న ఒంటరి ఏనుగు బుధవారం రాత్రి గాంధీనగర్‌ సమీపంలోని వ్యవసాయ బావిలో...

బావిలో పడి.. లేచిన ఏనుగు!

చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం మండలాల్లోని అటవీ సరిహద్డు గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న ఒంటరి ఏనుగు బుధవారం రాత్రి గాంధీనగర్‌ సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయింది. గురువారం ఉదయాన్నే ఏనుగు ఘీంకారాలు విన్న గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఎస్కలేటర్‌ సాయంతో కొంత మట్టిని బావిలోకి వేశారు. దీంతో ఏనుగు అతికష్టం మీద మోకాళ్ల సాయంతో ఎగబడి బావినుంచి వెలుపలికి వచ్చి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. అటవీ ప్రాంతంలో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో ఏనుగు ఇక్కడికి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. -పలమనేరు

Updated Date - 2020-04-10T08:14:49+05:30 IST