ఈ ఏనుగు కథ వింటే కన్నీరు పెట్టిస్తుంది...

ABN , First Publish Date - 2021-01-23T02:16:08+05:30 IST

మూగ జీవాలు... ఏ బాధా చెప్పలేవు. ఏ సంతోషాన్నీ వ్యక్తీకరించలేవు. రాజేంద్రుడు- గజేంద్రుడు సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్

ఈ ఏనుగు కథ వింటే కన్నీరు పెట్టిస్తుంది...

చెన్నై : మూగ జీవాలు... ఏ బాధా చెప్పలేవు. ఏ సంతోషాన్నీ వ్యక్తీకరించలేవు. రాజేంద్రుడు- గజేంద్రుడు సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏనుగును చూసుకున్నంత మురిపెంగా చూసుకోకపోయినా... కనీసం వాటిపై కరుణ చూపితే చాలు. వాటి మానాన వాటిని బతకనిస్తే చాలు. దాని బాధను అర్థం చేసుకుంటే మరీ సంతోషం. బాధను అర్థం చేసుకోకపోయినా... కనీసం వాటి జోలికి వెళ్లకుంటే అదే పదివేలు. కానీ తమిళనాడులో ఓ వ్యక్తి 40 సంవత్సరాల ఏనుగు విషయంలో మరీ క్రూరంగా ప్రవర్తించాడు. ఆ ఏనుగును తరిమికొట్టడానికి రాక్షసంగా ప్రవర్తించాడు. ఏనుగును ఏ కర్రతోనో తరిమికొట్టాల్సింది పోయి.. ఏకంగా ఓ టైరుకు నిప్పుపెట్టి, ఆ టైరును ఏనుగు పైకి విసిరాడు. ఆ టైరు ఏనుగు చెవికి చిక్కుకుంది. దీంతో ఏనుగు చెవితో పాటు వీపు భాగం పూర్తిగా కాలిపోయింది. నిప్పుతో ఉన్న టైరు ఒక్కసారిగా మీద పడటంతో ఏనుగు బిత్తరపోయింది.


అలా హడలిపోవడంతో నిప్పు మిగితా భాగాలకు అంటుకుంది. ఈ ఘటన మాసినగూడిలోని నీలగిరీ ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త అటవీ శాఖ అధికారుల చెవిన పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఏనుగును చికిత్స నిమిత్తమై తరలిస్తుండగానే మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది ఆ ఏనుగు. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులను తాము గుర్తించామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేశామని, మూడో వ్యక్తిని తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఏ అవసరం నిమిత్తమై ఆ మూగజీవి అటు వైపు వచ్చిందో... దాని బాధను ఎవరైనా అర్థం చేసుకొని, తీరుస్తారని వచ్చిందో కానీ... దుర్మార్గుడి ప్రవర్తనకు జీవం కోల్పోయింది. 

Updated Date - 2021-01-23T02:16:08+05:30 IST