రెండేళ్లకే నూరేళ్లు నిండిన ఎస్తేరు

ABN , First Publish Date - 2020-02-20T07:40:07+05:30 IST

విద్యుదాఘాతంతో బాలిక మృతిచెందిన సంఘటన పెదకూరపాడు మండలంలోని తమ్మవరంలో జరిగింది. పెదకూరపాడు ఎస్సై ఉయ్యూరు సోమేశ్వరరావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం...

రెండేళ్లకే నూరేళ్లు నిండిన ఎస్తేరు

పెదకూరపాడు, ఫిబ్రవరి 19: విద్యుదాఘాతంతో బాలిక మృతిచెందిన సంఘటన పెదకూరపాడు మండలంలోని తమ్మవరంలో జరిగింది. పెదకూరపాడు ఎస్సై ఉయ్యూరు సోమేశ్వరరావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొమ్ము అమల, మరియదాసుల రెండో కుమార్తె ఎస్తేరు (2) మంగళవారం సాయంత్రం వారి ఇంటి ఎదురుగా ఉన్న గుడేటి రామయ్య ఇంటి వద్ద ఆడుకుంటోంది. వారి ఇంటి నీళ్లమోటారుకు ఉన్న విద్యుత్‌ వైర్లను పట్టుకోవడం కరెంటు షాకుకు గురై అపస్మారకస్థితిలో వెళ్లింది. గమనించిన తల్లి అమల పరుగున వచ్చి మోటారు వైర్లపై కర్రతో కొట్టి చిన్నారిని వేరుచేసింది. కొన ఊపిరితో ఉన్న బాలికను అమరావతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు చిన్నారి మృతిచెందిందని నిర్ధారించారు. బుధవారం చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఉయ్యూరు సోమేశ్వరరావు తెలిపారు. మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన మరియదాసు కుటుంబ సభ్యులు ఏడాది క్రితం తమ్మవరం వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె విద్యుత్‌షాక్‌తో మృతిచెందింది.. 

Updated Date - 2020-02-20T07:40:07+05:30 IST