రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు దారుణం
ABN , First Publish Date - 2020-10-19T06:07:58+05:30 IST
రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల తీరు దారుణమని, దీన్ని ప్రతి రైతు ప్రతిఘటించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో
రైతులు ప్రతిఘటించాలి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు
నెల్లూరు (వైద్యం), అక్టోబరు 18 : రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల తీరు దారుణమని, దీన్ని ప్రతి రైతు ప్రతిఘటించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ విధానాలను తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వాగతించటం సరికాదన్నారు. పొలాలకు విద్యుత్ మీటర్లు బిగించటం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం అప్పుగా ఇస్తానని చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని సూచించారు.