నడిరోడ్డుపై విద్యుత్ స్తంభాలు
ABN , First Publish Date - 2021-04-14T06:08:31+05:30 IST
పట్టణంలోని అమరాపురం-హిందూపురం ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మడకశిర అర్బన్, ఏప్రిల్ 13 : పట్టణంలోని అమరాపురం-హిందూపురం ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని మధుగిరి రోడ్డు సర్కిల్ల్లో, పాత కర్ణాటక బ్యాంకు, పెట్రోల్ బంకు ముందు ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఈ విద్యుత్ స్తంభాల కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సంబంధిత విద్యుత్ అధికారులు స్తందించి ఈ స్తంభాలను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.